TGSRTC నకిలీ లోగో..ఇద్దరి పై కేసు నమోదు
- May 24, 2024
హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీ నకిలీ లోగోను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంతం దిలీప్, హరీష్ రెడ్డిలపై ఐపీసీ, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. టీజీఎస్ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిందితులు పోస్టులు పెడుతున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ లోగోతో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని సజ్జనర్ తెలిపారు. ఇప్పటివరకు కొత్త లోగోను అధికారికంగా విడుదల చేయలేదని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
తాజా వార్తలు
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న శ్రీ పల్లవి
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ
- లోక్ భవన్లో ఘనంగా గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు









