TGSRTC నకిలీ లోగో..ఇద్దరి పై కేసు నమోదు
- May 24, 2024
హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీ నకిలీ లోగోను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంతం దిలీప్, హరీష్ రెడ్డిలపై ఐపీసీ, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. టీజీఎస్ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిందితులు పోస్టులు పెడుతున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. టీజీఎస్ ఆర్టీసీ కొత్త లోగో అంటూ సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ లోగోతో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని సజ్జనర్ తెలిపారు. ఇప్పటివరకు కొత్త లోగోను అధికారికంగా విడుదల చేయలేదని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!