విరిగిపడ్డ కొండచరియలు…100 మంది మృతి
- May 24, 2024
న్యూ గునియా: కొండచరియలు విరిగిపడి వందమంది మృతి చెందారు. ఈఘటన పాపువా న్యూ గునియాలో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగిపడటంతో అందరూ నిద్రలో ఉన్నారు. నిద్రలోనే వారంతా అనంతలోకాలకు వెళ్లిపోయారు.
మరోవైపు కౌకలం గ్రామం మొత్తం ధ్వంసం అయ్యింది. గ్రామం సమీపంలోనే పర్వతం ఉంది. ఈ పర్వతం పైనుంచే కొండచరియలు విరిగిపడ్డాయి. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద ఉన్నవారి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఈ ఆపరేషన్లో అధికారులతో పాటు స్థానికులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతల స్వీకారం!
- రిటైర్డ్ పోలీసుల సేవలు ఆదర్శప్రాయం: సైబరాబాద్ సీపీ
- తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న శ్రీ పల్లవి
- ఆధునీకరణ పనులు పూర్తి.. కువైట్ ఆరోగ్య కేంద్రం రీ ఓపెన్..!!
- వచ్చే వారం సముద్రం కల్లోలంగా ఉంటుంది: ఖతార్
- మస్కట్లో పీస్ వాక్.. బీచ్ క్లినింగ్ ఈవెంట్..!!
- జూన్ నెలకి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో జూన్ 7నుంచి ఫస్ట్ ఫేజ్ సమ్మర్ హీట్..!
- మక్కా, పవిత్ర స్థలాల్లో 38వేలకుపైగా తనిఖీలు..!!
- ఎబోలా వైరస్ పరిణామాలను పర్యవేక్షిస్తున్నాము: యూఏఈ









