హైదరాబాదీలకి గుడ్ న్యూస్..కింగ్ కోహ్లీ ప్రత్యేక ఆహ్వానం..
- May 24, 2024
హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పలు రంగాల్లో తనదైన శైలిలో చెరగని ముద్రవేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ పక్క బ్రాండెడ్ క్లాత్ బిజినెస్తో పాటుగా కోహ్లీ మరోపక్క రెస్టారెంట్ల బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు.
కొన్నేళ్లుగా కోహ్లీ వన్8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ హోటల్స్ బెంగళూరు, ముంబై, పుణె, కోల్కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్స్ని కోహ్లీ ఏర్పాటు చేశాడు. అక్కడ వీటి వ్యాపారం జోరుగా సాగుతుంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు గాను హైదరాబాద్ మహానగరంలో తన రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాడానికి సిద్ధమయ్యారు.
ఈ వన్8 కమ్యూన్ కొత్త బ్రాంచ్ని కోహ్లీ హైదరాబాద్లోని HITEC సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ సమీపంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్లో శుక్రవారం గ్రాండ్గా ఓపెన్ కానుంది. ఈ విషయాన్ని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







