హైదరాబాదీలకి గుడ్ న్యూస్..కింగ్ కోహ్లీ ప్రత్యేక ఆహ్వానం..
- May 24, 2024
హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పలు రంగాల్లో తనదైన శైలిలో చెరగని ముద్రవేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ పక్క బ్రాండెడ్ క్లాత్ బిజినెస్తో పాటుగా కోహ్లీ మరోపక్క రెస్టారెంట్ల బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు.
కొన్నేళ్లుగా కోహ్లీ వన్8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ హోటల్స్ బెంగళూరు, ముంబై, పుణె, కోల్కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్స్ని కోహ్లీ ఏర్పాటు చేశాడు. అక్కడ వీటి వ్యాపారం జోరుగా సాగుతుంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు గాను హైదరాబాద్ మహానగరంలో తన రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాడానికి సిద్ధమయ్యారు.
ఈ వన్8 కమ్యూన్ కొత్త బ్రాంచ్ని కోహ్లీ హైదరాబాద్లోని HITEC సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ సమీపంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్లో శుక్రవారం గ్రాండ్గా ఓపెన్ కానుంది. ఈ విషయాన్ని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







