హైదరాబాదీలకి గుడ్ న్యూస్..కింగ్ కోహ్లీ ప్రత్యేక ఆహ్వానం..
- May 24, 2024
హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పలు రంగాల్లో తనదైన శైలిలో చెరగని ముద్రవేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ పక్క బ్రాండెడ్ క్లాత్ బిజినెస్తో పాటుగా కోహ్లీ మరోపక్క రెస్టారెంట్ల బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు.
కొన్నేళ్లుగా కోహ్లీ వన్8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ హోటల్స్ బెంగళూరు, ముంబై, పుణె, కోల్కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్స్ని కోహ్లీ ఏర్పాటు చేశాడు. అక్కడ వీటి వ్యాపారం జోరుగా సాగుతుంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు గాను హైదరాబాద్ మహానగరంలో తన రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాడానికి సిద్ధమయ్యారు.
ఈ వన్8 కమ్యూన్ కొత్త బ్రాంచ్ని కోహ్లీ హైదరాబాద్లోని HITEC సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ సమీపంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్లో శుక్రవారం గ్రాండ్గా ఓపెన్ కానుంది. ఈ విషయాన్ని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్









