హైదరాబాద్ నగర వాసులకు మెట్రో గుడ్ న్యూస్..
- May 24, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ లో స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటివరకు శుక్రవారం రాత్రి 11 గంటల వరకే మెట్రో నడువగా..ఇక నుండి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 AM గంటల నుంచే రైళ్లు నడవనున్నట్లు తెలిపింది. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రతి శుక్రవారం మెట్రో ప్రయాణ వేళలను పొడిగించినట్లు తెలిపింది. పొడిగించిన సర్వీస్ వేళలతో లేట్ మీటింగ్స్, ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఇక మీకు అడ్డుండవు … మీ బ్యాగ్లను ప్యాక్ చేసి మెట్రో ఎక్కండని ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!