హైదరాబాద్ నగర వాసులకు మెట్రో గుడ్ న్యూస్..
- May 24, 2024
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ లో స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటివరకు శుక్రవారం రాత్రి 11 గంటల వరకే మెట్రో నడువగా..ఇక నుండి ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు సర్వీసు పొడిగిస్తున్నట్లు మెట్రో రైలు అధికారులు వెల్లడించారు. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 AM గంటల నుంచే రైళ్లు నడవనున్నట్లు తెలిపింది. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ప్రతి శుక్రవారం మెట్రో ప్రయాణ వేళలను పొడిగించినట్లు తెలిపింది. పొడిగించిన సర్వీస్ వేళలతో లేట్ మీటింగ్స్, ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు ఇక మీకు అడ్డుండవు … మీ బ్యాగ్లను ప్యాక్ చేసి మెట్రో ఎక్కండని ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!









