యాదాద్రి భక్తులకు గుడ్న్యూస్..
- May 25, 2024
తెలంగాణ: తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం యాదాద్రి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై తిరుమలలో మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తులు ఆన్లైన్లో స్వామివారి దర్శనంతో పాటు ఆర్జిత సేవలను కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
స్వామివారి దర్శనం టిక్కెట్లతో పాటు ఆర్జిత సేవా టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకునే భక్తులు http://yadadritemple.telangana.gov.in ను సందర్శించాలని.. అక్కడ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఈవో తెలిపారు. ఈ సైట్ ద్వారా కూడా భక్తులు స్వామివారి ఈ-హుండీకి విరాళాలు ఇవ్వవచ్చని తెలిపారు. స్వామివారి దర్శనం, పూజా కైంకర్యానికి గంట ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని యాదాద్రి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం: నిర్లక్ష్యం చిన్నదే.. ప్రమాదమే ఘోరం
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు