యాదాద్రి భక్తులకు గుడ్న్యూస్..
- May 25, 2024
తెలంగాణ: తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం యాదాద్రి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై తిరుమలలో మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తులు ఆన్లైన్లో స్వామివారి దర్శనంతో పాటు ఆర్జిత సేవలను కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
స్వామివారి దర్శనం టిక్కెట్లతో పాటు ఆర్జిత సేవా టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకునే భక్తులు http://yadadritemple.telangana.gov.in ను సందర్శించాలని.. అక్కడ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఈవో తెలిపారు. ఈ సైట్ ద్వారా కూడా భక్తులు స్వామివారి ఈ-హుండీకి విరాళాలు ఇవ్వవచ్చని తెలిపారు. స్వామివారి దర్శనం, పూజా కైంకర్యానికి గంట ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని యాదాద్రి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









