చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్
- May 25, 2024
దుబాయ్: ముఖేష్ అంబానీ ప్రపంచంలోని తొమ్మిదవ అత్యంత సంపన్న వ్యక్తిగా, భారతదేశం, ఆసియా అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు.తమ చిన్న కుమారుడి పెళ్లి సన్నాహాల్లో ఉన్నారు. మొదటి ప్రీ వెడ్డుకలను జామ్ నగర్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందుకోసం దాదాపు INR 1259 కోట్లు ఖర్చు చేశారు. సూపర్ స్టార్ రిహన్నాకు INR 74 కోట్ల మధ్య చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జులైలో నిర్వహించే పెళ్లికి అంతకు రెండింతలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అనంత్, రాధికలకు ముఖేష్ అంబానీ పెళ్లి కానుక.
తన కుమారుడు అనంత్ కోసం, ముఖేష్ అంబానీ దుబాయ్లో బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. నివేదికల ప్రకారం, ఈ పామ్ జుమేరా ఇల్లు దుబాయ్లో అత్యంత ఖరీదైనది. ఏప్రిల్ 2022లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 బెడ్రూమ్లు మరియు 70 మీటర్ల ప్రైవేట్ బీచ్తో ముఖేష్ అంబానీ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సంపన్నమైన భవనం ధర 640 కోట్ల రూపాయలు. దుబాయ్లో ఇది రెండవ అతిపెద్ద రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. ప్రత్యేకమైన కళాకృతితో, ఇటాలియన్ మార్బుల్స్ తో విల్లా లోపలి భాగాన్ని అలంకరించారు. ఈ ఇల్లు ప్రైవేట్ బీచ్తో సహా బిలియనీర్ల కుటుంబం కోరుకునే ప్రతి విలాసవంతమైన సౌకర్యాన్ని కలిగి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







