చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్
- May 25, 2024
దుబాయ్: ముఖేష్ అంబానీ ప్రపంచంలోని తొమ్మిదవ అత్యంత సంపన్న వ్యక్తిగా, భారతదేశం, ఆసియా అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు.తమ చిన్న కుమారుడి పెళ్లి సన్నాహాల్లో ఉన్నారు. మొదటి ప్రీ వెడ్డుకలను జామ్ నగర్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందుకోసం దాదాపు INR 1259 కోట్లు ఖర్చు చేశారు. సూపర్ స్టార్ రిహన్నాకు INR 74 కోట్ల మధ్య చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జులైలో నిర్వహించే పెళ్లికి అంతకు రెండింతలు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అనంత్, రాధికలకు ముఖేష్ అంబానీ పెళ్లి కానుక.
తన కుమారుడు అనంత్ కోసం, ముఖేష్ అంబానీ దుబాయ్లో బీచ్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. నివేదికల ప్రకారం, ఈ పామ్ జుమేరా ఇల్లు దుబాయ్లో అత్యంత ఖరీదైనది. ఏప్రిల్ 2022లో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 బెడ్రూమ్లు మరియు 70 మీటర్ల ప్రైవేట్ బీచ్తో ముఖేష్ అంబానీ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సంపన్నమైన భవనం ధర 640 కోట్ల రూపాయలు. దుబాయ్లో ఇది రెండవ అతిపెద్ద రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. ప్రత్యేకమైన కళాకృతితో, ఇటాలియన్ మార్బుల్స్ తో విల్లా లోపలి భాగాన్ని అలంకరించారు. ఈ ఇల్లు ప్రైవేట్ బీచ్తో సహా బిలియనీర్ల కుటుంబం కోరుకునే ప్రతి విలాసవంతమైన సౌకర్యాన్ని కలిగి ఉంది.
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!