కొత్త హజ్, ఉమ్రా రూల్స్.. ఉల్లంఘనలకు Dh50,000 వరకు జరిమానా
- May 28, 2024
యూఏఈ: ఇస్లామిక్ అఫైర్స్ మరియు ఎండోమెంట్స్ జనరల్ అథారిటీ నుండి ముందస్తు అనుమతి లేకుండా యూఏఈలోని ఆపరేటర్లు హజ్ లేదా ఉమ్రా కోసం దరఖాస్తులు లేదా అభ్యర్థనలను స్వీకరించలేరు. ఈ మేరకు అథారిటీ ప్రకటించింది. సేవలను దుర్వినియోగం చేస్తే భారీ జరిమానాలను అధికార యంత్రాంగం ప్రకటించింది. వ్యక్తులు, ప్రచార నిర్వాహకులు మరియు కార్యాలయాలు చట్టాన్ని ఉల్లంఘనకు పాల్పడితే 50,000 దిర్హామ్ల వరకు జరిమానా విధించనున్నారు. ఆపరేటర్లు హజ్ లేదా ఉమ్రా ట్రిప్లను నిర్వహించడానికి లేదా ప్రచారం చేయడానికి ముందు అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతి పొందవలసి ఉంటుంది. దీనితోపాటు లైసెన్స్ లేకుండా తీర్థయాత్ర కోసం విరాళాలు సేకరించడం లేదా స్వీకరించడాన్ని నిషేధించారు. కొత్త రూల్స్ ను దేశంలోని లైసెన్స్ పొందిన ఆపరేటర్లు స్వాగతించారు. కఠినమైన జరిమానా చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









