కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
- May 30, 2024
తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని, ఈశాన్య ప్రాంతాలను తాకాయి. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తారు. రానున్న 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే కేరళను తాకాయి నైరుతి రుతుపవనాలు.
తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది.
కాగా, నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1-4 మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల









