ఈ-సిగరెట్ వినియోగం పై యూఏఈ హెచ్చరిక
- May 31, 2024
యూఏఈ: సాంప్రదాయ సిగరెట్లకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా ఎలక్ట్రానిక్ ధూమపాన ఉత్పత్తులను ప్రచారం చేయడంపై యూఏఈని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ప్రచారాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (మోహాప్) తెలిపింది. మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ధూమపానం మానేయాలని కోరింది. హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం మరియు మానసిక ఆరోగ్య సమస్యల వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల గురించి హెచ్చరించింది. పొగాకు సిగరెట్ల వలే నికోటిన్ ఉత్పత్తులు కూడా సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నివేదికలో పేర్కొంది. నికోటిన్తో కూడిన ఇ-సిగరెట్లు ఆరోగ్యానికి హానికరమని,ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు చూపుతాయని, అవి కొన్ని రకాల విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయని నిర్ధారించబడిందని తెలిపింది. వాటిలో కొన్ని క్యాన్సర్కు కారణమవుతాయని, అదే సమయంలో కొన్ని గుండె మరియు ఊపిరితిత్తుల రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించింది. ఇ-సిగరెట్ల వాడకం మెదడు అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. యూఏఈ చట్టాల ప్రకారం, దేశవ్యాప్తంగా కార్యాలయాలు మరియు క్లోజ్డ్ ప్రదేశాలలో ఈ-సిగరెట్లు తాగడంపై నిషేధం ఉంది. సిగరెట్ చట్టాలు ఇ-సిగరెట్లకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









