ఈ-సిగరెట్ వినియోగం పై యూఏఈ హెచ్చరిక
- May 31, 2024
యూఏఈ: సాంప్రదాయ సిగరెట్లకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా ఎలక్ట్రానిక్ ధూమపాన ఉత్పత్తులను ప్రచారం చేయడంపై యూఏఈని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ప్రచారాలకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ (మోహాప్) తెలిపింది. మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ధూమపానం మానేయాలని కోరింది. హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం మరియు మానసిక ఆరోగ్య సమస్యల వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాల గురించి హెచ్చరించింది. పొగాకు సిగరెట్ల వలే నికోటిన్ ఉత్పత్తులు కూడా సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక నివేదికలో పేర్కొంది. నికోటిన్తో కూడిన ఇ-సిగరెట్లు ఆరోగ్యానికి హానికరమని,ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు చూపుతాయని, అవి కొన్ని రకాల విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయని నిర్ధారించబడిందని తెలిపింది. వాటిలో కొన్ని క్యాన్సర్కు కారణమవుతాయని, అదే సమయంలో కొన్ని గుండె మరియు ఊపిరితిత్తుల రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరించింది. ఇ-సిగరెట్ల వాడకం మెదడు అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. యూఏఈ చట్టాల ప్రకారం, దేశవ్యాప్తంగా కార్యాలయాలు మరియు క్లోజ్డ్ ప్రదేశాలలో ఈ-సిగరెట్లు తాగడంపై నిషేధం ఉంది. సిగరెట్ చట్టాలు ఇ-సిగరెట్లకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







