నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- January 13, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) మూడు టెర్మినల్స్ లో ఈ-వాలెట్ పార్కింగ్ కోసం దుబాయ్ రోడ్ టోల్ సంస్థ సాలిక్ తో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ మేరకు దుబాయ్ విమానాశ్రయాల ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మరియు సాలిక్ ఛైర్మన్ మట్టర్ అల్ తాయర్ 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం.. DXBలోని అన్ని పెయిడ్ కార్ పార్కింగ్లలో సాలిక్ ఈ-వాలెట్ చెల్లింపులకు అనుమతించనున్నారు. ఇది జనవరి 22, 2026 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. జూలై మరియు సెప్టెంబర్ మధ్య 24.2 మిలియన్ల అతిథులకు సేవలు అందించింది. 2025 మొదటి తొమ్మిది నెలలకు మొత్తం ట్రాఫిక్ 70.1 మిలియన్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









