నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- January 13, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) మూడు టెర్మినల్స్ లో ఈ-వాలెట్ పార్కింగ్ కోసం దుబాయ్ రోడ్ టోల్ సంస్థ సాలిక్ తో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ మేరకు దుబాయ్ విమానాశ్రయాల ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మరియు సాలిక్ ఛైర్మన్ మట్టర్ అల్ తాయర్ 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం.. DXBలోని అన్ని పెయిడ్ కార్ పార్కింగ్లలో సాలిక్ ఈ-వాలెట్ చెల్లింపులకు అనుమతించనున్నారు. ఇది జనవరి 22, 2026 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
దుబాయ్ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. జూలై మరియు సెప్టెంబర్ మధ్య 24.2 మిలియన్ల అతిథులకు సేవలు అందించింది. 2025 మొదటి తొమ్మిది నెలలకు మొత్తం ట్రాఫిక్ 70.1 మిలియన్లుగా నమోదైంది.
తాజా వార్తలు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!









