కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- January 13, 2026
కువైట్: ఈ సంవత్సరం చివరి నాటికి అన్ని రంగాలలో స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఇన్ స్టాలేషన్ పూర్తి చేయడానికి విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. స్మార్ట్ మీటర్ రోల్ అవుట్ పూర్తి చేయడం వల్ల పర్యావరణ మరియు వ్యూహాత్మక ప్రయోజనాలు లభిస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది. స్మార్ట్ సిటీలను నిర్మించడంలో మరియు కువైట్ విజన్ 2035, మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంలో స్మార్ట్ మీటర్లు కీలకంగా మారనున్నాయి. కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మరియు పర్యావరణ పరిరక్షణకు నేరుగా దోహదపడే మొత్తం శక్తి వినియోగాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయని భావిస్తున్నారు.
వినియోగదారులు మొబైల్ అప్లికేషన్లు లేదా హోమ్ డిస్ప్లే స్క్రీన్ల ద్వారా వారి రియల్-టైమ్ విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించగలుగుతారు. అధిక వినియోగ పరికరాలను గుర్తించడంలో వారికి సహాయపడుతుంది. ముఖ్యంగా గరిష్ట వినియోగ సమయాల్లో వారి విద్యుత్ బిల్లులను 10 శాతం వరకు తగ్గించుకోవడానికి వీలు కల్పిస్తాయని మంత్రిత్వశాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్









