రామోజీగ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు కన్నుమూత..
- June 08, 2024
హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత, రామోజీ గ్రూప్ ఛైర్మన్ చెరుకూరి రామోజీ రావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం రామోజీ రావు తీవ్ర అస్వస్థతకు గురవడంతో.. వెంటనే ఆయనను హైదరాబాద్ శివారులో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ రావు నివాసం నుంచి.. నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు ఆయనకి వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం కన్నుమూసారు. ఆయన పార్ధివ దేహాన్ని ఫిలింసిటీలోని నివాసానికి తరలించనున్నారు. రామోజీరావు కన్నుమూసారన్న వార్తతో ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి చెందుతున్నారు.ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..