ఇండియా-ఒమన్ సముద్ర రక్షణ సంబంధాలు బలోపేతం
- June 08, 2024
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ (IN), రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ (RNO) మధ్య 6వ ఎడిషన్ స్టాఫ్ చర్చలు జూన్ 4 నుండి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సముద్ర ప్రాంతంలో భారత్ - ఒమన్ మధ్య ప్రస్తుతం ఉన్న రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించినట్టు తెలిపింది. RNO నుండి ప్రతినిధి బృందానికి జాసిమ్ మొహమ్మద్ అలీ అల్ బలూషి నాయకత్వం వహించారు. భారతదేశం నుండి వచ్చిన ప్రతినిధి బృందానికి కమోడోర్ (FC) మన్మీత్ సింగ్ ఖురానా నాయకత్వం వహించారు. రెండు చారిత్రక సముద్ర దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం గురించి నేవీ-టు-నేవీ స్టాఫ్ చర్చలు సాగాయని పేర్కొంది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA







