యూఏఈలో రాబోయే రోజుల్లో నియామకాలు ఫ్రీజ్..!
- June 13, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లోని మెజారిటీ కంపెనీలు (63 శాతం) రాబోయే 12 నెలల్లో తమ హెడ్కౌంట్ను పెంచుకోవాలని యోచిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని నియామకాలను ఆలస్యం చేయాలని, లేదా కొత్త రిక్రూట్మెంట్ను స్తంభింపజేస్తాయని ఒక అధ్యయనం తెలిపింది. రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ రాబర్ట్ హాఫ్ మాట్లాడుతూ.. గ్లోబల్ ఎకనామిక్ పిక్చర్ - బహుళ ఎన్నికల షెడ్యూల్, అస్థిర ద్రవ్యోల్బణం యూఏఈ వ్యాపార పనితీరుకు అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటన్నారు. దీంతో అనేక మంది నియామక కార్యకలాపాలను కొంత కాలానికి ఫ్రీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. యూఏఈలోని 100 మంది సీనియర్ వ్యాపార నిర్ణయాధికారుల అభిప్రాయాలతో ఈ సర్వే నిర్వహించారు. మూడింట ఒక వంతు ( 33 శాతం) యూఏఈ వ్యాపార ప్రముఖులు ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా అమెరికా, యూకే లలో ఎన్నికల ఫలితాలు తెలిసే వరకు నియామక నిర్ణయాల కోసం వేచి ఉన్నామని చెప్పారు. 32 శాతం మంది ఆయా దేశాల్లో వడ్డీ రేట్లు స్థిరీకరించడానికి వేచి ఉన్నారు. మరోవైపు యూఏఈలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో తమ సంస్థ నియామకాలు ఫ్రీజ్ చేయాలని యోచిస్తున్నట్లు యూఏఈ ఎగ్జిక్యూటివ్లలో ముగ్గురిలో ఒకరు (29 శాతం) అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









