యూఏఈలో రాబోయే రోజుల్లో నియామకాలు ఫ్రీజ్..!
- June 13, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లోని మెజారిటీ కంపెనీలు (63 శాతం) రాబోయే 12 నెలల్లో తమ హెడ్కౌంట్ను పెంచుకోవాలని యోచిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని నియామకాలను ఆలస్యం చేయాలని, లేదా కొత్త రిక్రూట్మెంట్ను స్తంభింపజేస్తాయని ఒక అధ్యయనం తెలిపింది. రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ రాబర్ట్ హాఫ్ మాట్లాడుతూ.. గ్లోబల్ ఎకనామిక్ పిక్చర్ - బహుళ ఎన్నికల షెడ్యూల్, అస్థిర ద్రవ్యోల్బణం యూఏఈ వ్యాపార పనితీరుకు అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటన్నారు. దీంతో అనేక మంది నియామక కార్యకలాపాలను కొంత కాలానికి ఫ్రీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. యూఏఈలోని 100 మంది సీనియర్ వ్యాపార నిర్ణయాధికారుల అభిప్రాయాలతో ఈ సర్వే నిర్వహించారు. మూడింట ఒక వంతు ( 33 శాతం) యూఏఈ వ్యాపార ప్రముఖులు ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా అమెరికా, యూకే లలో ఎన్నికల ఫలితాలు తెలిసే వరకు నియామక నిర్ణయాల కోసం వేచి ఉన్నామని చెప్పారు. 32 శాతం మంది ఆయా దేశాల్లో వడ్డీ రేట్లు స్థిరీకరించడానికి వేచి ఉన్నారు. మరోవైపు యూఏఈలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో తమ సంస్థ నియామకాలు ఫ్రీజ్ చేయాలని యోచిస్తున్నట్లు యూఏఈ ఎగ్జిక్యూటివ్లలో ముగ్గురిలో ఒకరు (29 శాతం) అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







