ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 27న ‘దేవర’ గ్రాండ్ రిలీజ్
- June 16, 2024
హైదరాబాద్: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో ఈ మూవీ అత్యద్భుతంగా, శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
గురువారం చిత్ర యూనిట్ ‘దేవర’ మూవీ కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసింది. ప్రేక్షకులకు ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్తో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించటానికి దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’, సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఎంటైర్ ఇండియాలోని సినీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ పాన్ ఇండియా భారీ చిత్రాన్ని విడుదల చేయటానికి ఇదే కరెక్ట్ డేట్ అని మేకర్స్ భావిస్తున్నారు.
తాజా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్తో ‘దేవర’ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఎన్టీఆర్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజన్స్, కొరటాల శివ టేకింగ్ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్పై చూద్దామా అని అభిమానులు,ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘దేవర’గా టైటిల్ పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









