25 ఆస్తులను ఉపసంహరించుకున్న మంత్రిత్వ శాఖ

- June 17, 2024 , by Maagulf
25 ఆస్తులను ఉపసంహరించుకున్న మంత్రిత్వ శాఖ

మనామా: మునిసిపాలిటీలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ గతంలో ప్రజా వినియోగానికి కేటాయించిన 25 ఆస్తులను ఉపసంహరించుకుంది. అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (UPDA) అభ్యర్థనను అనుసరించి అవి ఇకపై అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనం కోసం ఆస్తుల సేకరణకు సంబంధించి 2009 చట్టం నంబర్ 39 ప్రకారం మంత్రిత్వ శాఖ అధికారాన్ని ఉటంకిస్తూ అధికారిక గెజిట్‌లో ప్రచురించారు. వదులుకున్న ఆస్తులు ఆలీ, అల్ సెహ్లా, సీత్రా, హవారత్ సనద్ మరియు నువైద్రత్‌లో ఉన్నాయి. UPDA యొక్క నిర్ణయాన్ని అనుసరించి మునిసిపాలిటీల మంత్రిత్వ శాఖ పైన పేర్కొన్న అన్ని భవనాల యాజమాన్యాన్ని వదులుకుంది. ఇది సంబంధిత ప్రాజెక్ట్‌లకు ఇకపై ఉపయోగపడదని పేర్కొంది. 2009 చట్టం నెం. 39 ప్రకారం, ఆస్తి యజమానులకు రిలీక్విష్‌మెంట్ అధికారిక నోటిఫికేషన్‌గా పనిచేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com