25 ఆస్తులను ఉపసంహరించుకున్న మంత్రిత్వ శాఖ
- June 17, 2024
మనామా: మునిసిపాలిటీలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ గతంలో ప్రజా వినియోగానికి కేటాయించిన 25 ఆస్తులను ఉపసంహరించుకుంది. అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (UPDA) అభ్యర్థనను అనుసరించి అవి ఇకపై అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనం కోసం ఆస్తుల సేకరణకు సంబంధించి 2009 చట్టం నంబర్ 39 ప్రకారం మంత్రిత్వ శాఖ అధికారాన్ని ఉటంకిస్తూ అధికారిక గెజిట్లో ప్రచురించారు. వదులుకున్న ఆస్తులు ఆలీ, అల్ సెహ్లా, సీత్రా, హవారత్ సనద్ మరియు నువైద్రత్లో ఉన్నాయి. UPDA యొక్క నిర్ణయాన్ని అనుసరించి మునిసిపాలిటీల మంత్రిత్వ శాఖ పైన పేర్కొన్న అన్ని భవనాల యాజమాన్యాన్ని వదులుకుంది. ఇది సంబంధిత ప్రాజెక్ట్లకు ఇకపై ఉపయోగపడదని పేర్కొంది. 2009 చట్టం నెం. 39 ప్రకారం, ఆస్తి యజమానులకు రిలీక్విష్మెంట్ అధికారిక నోటిఫికేషన్గా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం









