ఏపీలో పేదలకు గుడ్ న్యూస్..
- June 17, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదలకు పక్కా ఇల్లు ఇస్తామని మంత్రి పార్థసారథి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పేదలకు ఆయన గుడ్ న్యూస్ తెలిపారు.
త్వరలో క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. నివాస యోగ్యంగకాని ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తాము మాత్రం నివాసానికి యోగ్యమైన భూముల్లో ఇల్లు కట్టిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పలువురు కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంతో వారంతా బాధ్యతలు స్వీకరించారు. పాలనపై దృష్టి పెట్టారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా కసరత్తులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నారు. దీంతో ప్రజా పాలన ప్రారంభమైందని పలువురు నేతలు అంటున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూాడాలి
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









