ఏపీలో పేదలకు గుడ్ న్యూస్..
- June 17, 2024అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదలకు పక్కా ఇల్లు ఇస్తామని మంత్రి పార్థసారథి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పేదలకు ఆయన గుడ్ న్యూస్ తెలిపారు.
త్వరలో క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. నివాస యోగ్యంగకాని ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తాము మాత్రం నివాసానికి యోగ్యమైన భూముల్లో ఇల్లు కట్టిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పలువురు కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంతో వారంతా బాధ్యతలు స్వీకరించారు. పాలనపై దృష్టి పెట్టారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా కసరత్తులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నారు. దీంతో ప్రజా పాలన ప్రారంభమైందని పలువురు నేతలు అంటున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూాడాలి
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దంపతులకు బిగ్షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము