ఏపీలో పేదలకు గుడ్ న్యూస్..
- June 17, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పేదలకు పక్కా ఇల్లు ఇస్తామని మంత్రి పార్థసారథి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పేదలకు ఆయన గుడ్ న్యూస్ తెలిపారు.
త్వరలో క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. నివాస యోగ్యంగకాని ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చిందన్నారు. తాము మాత్రం నివాసానికి యోగ్యమైన భూముల్లో ఇల్లు కట్టిస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పలువురు కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కడంతో వారంతా బాధ్యతలు స్వీకరించారు. పాలనపై దృష్టి పెట్టారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిపైనా కసరత్తులు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నారు. దీంతో ప్రజా పాలన ప్రారంభమైందని పలువురు నేతలు అంటున్నారు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూాడాలి
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







