టాలీవుడ్ చందమామ.. !
- June 19, 2024
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్లాప్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సక్సెస్లు చూసింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సీనియర్ అండ్ స్టార్ హీరోల నుంచి జూనియర్ హీరోలందరితోనూ నటించి ఆకట్టుకుంది. పెళ్లైన కూడా ఇంకా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. నేడు ఈ 'మిత్రవింద' పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాం.
1985లో జూన్ 19న పంజాబీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ముంబయిలో జన్మించింది కాజల్ అగర్వాల్. స్కూలింగ్ ముంబలోనే చేసింది. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసిందట. ఆ తర్వాత జై హింద్ కళాశాలలో ఇంటర్, అనంతరం మాస్ మీడియాలో గ్రాడ్యూవేషన్ చదివింది. ఆ తర్వాత ఎంబీఏ చదవాలని అనుకుంది. కానీ అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చింది.
బాలీవుడ్ చిత్రం క్యూన్ హో గయా నా(2004) చిత్రంతో అరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత 2007లో 'లక్ష్మి కళ్యాణం'(2007) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే తన యాక్టింగ్తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం 'చందమామ'తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. మగధర, గణేష్, ఆర్య 2, డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, దడ, బాద్షా, నాయక్, గొవిందుడు అందరివాడే లే ఇలా వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం కాజల్ అగర్వాల్ నెట్ వర్త్ రూ.67 కోట్ల వరకు ఉండొచ్చట. మరి కొన్ని వెబ్సైట్లలో ఆమె దగ్గర ఉన్న ఆస్తులు రూ.90కోట్ల వరకు ఉండొచ్చని కూడా రాశారు. ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు తీసుకుంటోందని తెలుస్తోంది. ముంబయిలో రూ.6 కోట్ల విలువ గల లగ్జరీ బంగలా ఉందట. ఆమె దగ్గర ఖరీదైన విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఆడీ ఏ4, రేంజ్ రోవర్, స్కోడా అక్టావియా ఉన్నాయట. అలానే ఆమెకు బ్యూటీ ప్రొడక్ట్స్ కు సంబంధించిన కంపెనీ కూడా ఉందట. దాని ద్వారా ఈ ముద్దుగుమ్మ బానే సంపాదిస్తోందట.
కాజల్ వ్యక్తిగత జీవితానికి వస్తే లాక్డౌన్లో కాజల్ సైలెంట్గా ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన ఈ భామ 2022లో కొడుకు నీల్ కిచ్లూకి జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ కారణం సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన కాజల్ బాలకృష్ణ భగవంత్ కేసరితో రీఎంట్రీ ఇచ్చింది.రీఎంట్రీలోనూ అదే జోరుతో వరుస సినిమాలు చేస్తూ ఉంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









