శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పెనుప్రమాదం తప్పింది
- June 20, 2024
హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. మలేషియన్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ నుంచి కౌలలంపూర్ బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించి ల్యాండింగ్కు పైలెట్ అనుమతి కోరారు. అనుమతి వచ్చే వరకు కొద్దిసేపు గాల్లో విమానం చక్కర్లు కొట్టింది. చివరకు ఎమర్జేన్సీ ల్యాండింగ్కు ఏటీసీ అనుమతించింది.
ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఘటన సమయంలో విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. సేఫ్ ల్యాండింగ్తో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు గాల్లోనే విమానం ఉంది. దీంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. నిన్న రాత్రి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. తమను గమ్యస్థానానికి ఎప్పుడు చేరుస్తారో చెప్పాలంటూ అధికారులను నిలదీస్తున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









