తెలుగు సినిమాపై మనసు పారేసుకున్న మరో బాలీవుడ్ హీరో.!
- June 21, 2024
బాలీవుడ్ నటీ నటులు తెలుగు సినిమాల్లో నటించేందుకు, తెలుగు టెక్నీషియన్లతో కలిసి పని చేసేందుకు తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే, బాలీవుడ్లో మన దర్శకులకు మంచి గౌరవ, అవకాశాలు దక్కుతున్న సంగతి కూడా తెలిసిందే.
ఇటీవలే రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ సినిమా తెలుగులో మంచి విజయం అందుకుంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సైతం తెలుగులో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
తాజాగా ఆ లిస్టులో చేరిపోయాడు బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్. గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే ఓ సినిమాలో సన్నీ డియోలో హీరోగా నటిస్తున్నాడు.
గోపీచంద్ మలినేని బాలయ్య కాంబినేషన్లో మొన్నా మధ్య ఓ సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ, రెగ్యులర్ షూట్ ఇంకా స్టార్ట్ కాలేదు. బాలయ్య రాజకీయాల్లో బిజీ అయిపోయిన కారణంగానో ఏమో, బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో సినిమా స్టార్ట్ చేశారు తాజాగా గోపీచంద్ మలినేని.
రీసెంట్గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. మైత్రీ మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!