తెలుగు సినిమాపై మనసు పారేసుకున్న మరో బాలీవుడ్ హీరో.!
- June 21, 2024
బాలీవుడ్ నటీ నటులు తెలుగు సినిమాల్లో నటించేందుకు, తెలుగు టెక్నీషియన్లతో కలిసి పని చేసేందుకు తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే, బాలీవుడ్లో మన దర్శకులకు మంచి గౌరవ, అవకాశాలు దక్కుతున్న సంగతి కూడా తెలిసిందే.
ఇటీవలే రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ సినిమా తెలుగులో మంచి విజయం అందుకుంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సైతం తెలుగులో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
తాజాగా ఆ లిస్టులో చేరిపోయాడు బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్. గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే ఓ సినిమాలో సన్నీ డియోలో హీరోగా నటిస్తున్నాడు.
గోపీచంద్ మలినేని బాలయ్య కాంబినేషన్లో మొన్నా మధ్య ఓ సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ, రెగ్యులర్ షూట్ ఇంకా స్టార్ట్ కాలేదు. బాలయ్య రాజకీయాల్లో బిజీ అయిపోయిన కారణంగానో ఏమో, బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో సినిమా స్టార్ట్ చేశారు తాజాగా గోపీచంద్ మలినేని.
రీసెంట్గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. మైత్రీ మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







