తెలుగు సినిమాపై మనసు పారేసుకున్న మరో బాలీవుడ్ హీరో.!
- June 21, 2024
బాలీవుడ్ నటీ నటులు తెలుగు సినిమాల్లో నటించేందుకు, తెలుగు టెక్నీషియన్లతో కలిసి పని చేసేందుకు తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే, బాలీవుడ్లో మన దర్శకులకు మంచి గౌరవ, అవకాశాలు దక్కుతున్న సంగతి కూడా తెలిసిందే.
ఇటీవలే రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ సినిమా తెలుగులో మంచి విజయం అందుకుంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సైతం తెలుగులో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
తాజాగా ఆ లిస్టులో చేరిపోయాడు బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్. గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే ఓ సినిమాలో సన్నీ డియోలో హీరోగా నటిస్తున్నాడు.
గోపీచంద్ మలినేని బాలయ్య కాంబినేషన్లో మొన్నా మధ్య ఓ సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ, రెగ్యులర్ షూట్ ఇంకా స్టార్ట్ కాలేదు. బాలయ్య రాజకీయాల్లో బిజీ అయిపోయిన కారణంగానో ఏమో, బాలీవుడ్ హీరో సన్నీ డియోల్తో సినిమా స్టార్ట్ చేశారు తాజాగా గోపీచంద్ మలినేని.
రీసెంట్గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. మైత్రీ మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!







