‘హనుమాన్’ ప్రొడ్యూసర్తో తేజు సినిమా.!
- June 21, 2024
భయంకరమైన యాక్సిడెంట్ తర్వాత కొన్ని నెలలు రెస్ట్ తీసుకుని ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.
ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ‘బ్రో’ సినిమాతోనూ సూపర్ హిట్ కొట్టాడు. అటుపై కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్లో కొన్ని కథలు విన్నాడట.
ఓ కొత్త దర్శకుడు తీసుకొచ్చిన స్టోరీ సాయి ధరమ్ తేజ్కి బాగా నచ్చిందట. వెంటనే ఈ ప్రాజెక్ట్కి కమిట్ అయ్యాడట. ఈ సినిమాకి ‘హనుమాన్’ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి నిర్మించనున్నాడనీ తెలుస్తోంది.
కథా కమామిషు, ఆ కొత్త డైరెక్టర్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ ఈ రోజు సాయంత్రం కన్ఫామ్ చేయనున్నారట.
అన్ని కలిసొచ్చి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి మంచి హిట్టు కొడితే, అది తేజుకి హ్యాట్రిక్కే అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







