అధునాతన సౌకర్యాలతో కొత్త రక్తదాన కేంద్రం
- June 23, 2024
దోహా: కొత్తగా స్థాపించబడిన ఖతార్ నేషనల్ బ్లడ్ డొనేషన్ సెంటర్ (QNBDC) వందలాది మంది దాతలకు ఒకేసారి సేవలు అందిస్తుంది. ఇందులో అధునాతన సౌకర్యాల ద్వారా రక్త సేకరణను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రం పెద్ద ఎత్తున రక్తదానం ప్రచారాలను సులభతరం చేయడమే కాకుండా, దాతల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. "300 మంది దాతలకు ఒకేసారి వసతి కల్పించే సామర్థ్యం, 38 మంది దాతల నుండి ఒకేసారి రక్తాన్ని సేకరించే సామర్థ్యం కారణంగా QNBDC చాలా ప్రయోజనకరంగా ఉంది. దీనికి అదనంగా 12 పడకలతో ప్రత్యేక అఫెరిసిస్ సేకరణ గదిని ఏర్పాటు చేశారు." అని హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) లాబొరేటరీ మెడిసిన్ మరియు పాథాలజీ విభాగం (DLMP) డాక్టర్ ఈనాస్ అల్ కువారి చెప్పారు. "ప్రతి రక్తదానం మా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అనేక మంది రోగులకు కీలకమైన జీవనాధారంగా పనిచేస్తుంది. రక్తదానం ద్వారా సేకరించిన బ్లడ్ కనీసం ముగ్గురు రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ”అని డాక్టర్ అల్ కువారి చెప్పారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







