అధునాతన సౌకర్యాలతో కొత్త రక్తదాన కేంద్రం
- June 23, 2024
దోహా: కొత్తగా స్థాపించబడిన ఖతార్ నేషనల్ బ్లడ్ డొనేషన్ సెంటర్ (QNBDC) వందలాది మంది దాతలకు ఒకేసారి సేవలు అందిస్తుంది. ఇందులో అధునాతన సౌకర్యాల ద్వారా రక్త సేకరణను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రం పెద్ద ఎత్తున రక్తదానం ప్రచారాలను సులభతరం చేయడమే కాకుండా, దాతల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. "300 మంది దాతలకు ఒకేసారి వసతి కల్పించే సామర్థ్యం, 38 మంది దాతల నుండి ఒకేసారి రక్తాన్ని సేకరించే సామర్థ్యం కారణంగా QNBDC చాలా ప్రయోజనకరంగా ఉంది. దీనికి అదనంగా 12 పడకలతో ప్రత్యేక అఫెరిసిస్ సేకరణ గదిని ఏర్పాటు చేశారు." అని హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) లాబొరేటరీ మెడిసిన్ మరియు పాథాలజీ విభాగం (DLMP) డాక్టర్ ఈనాస్ అల్ కువారి చెప్పారు. "ప్రతి రక్తదానం మా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అనేక మంది రోగులకు కీలకమైన జీవనాధారంగా పనిచేస్తుంది. రక్తదానం ద్వారా సేకరించిన బ్లడ్ కనీసం ముగ్గురు రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ”అని డాక్టర్ అల్ కువారి చెప్పారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







