16 ట్రావెల్ కంపెనీల లైసెన్స్లను రద్దు చేసిన ఈజిప్ట్
- June 23, 2024
కైరో: యాత్రికుల అనధికార ప్రయాణానికి ఏర్పాట్లు చేశారన్న ఆరోపణలపై 16 ట్రావెల్ కంపెనీలకు లైసెన్స్లను రద్దు చేయాలని, వారి అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్కు పంపాలని ఈజిప్ట్ ప్రధాని ముస్తఫా మడ్బౌలీ ఆదేశించారు. ఈజిప్టు క్యాబినెట్ ప్రకటన ప్రకారం.. ఈ కంపెనీలు సరైన అనుమతి లేకుండా యాత్రికులను హజ్కు పంపడానికి మోసపూరిత పద్ధతులలో పాల్గొన్నాయని, యాత్రికులకు ఎటువంటి సేవలను అందించడంలో అవి పూర్తిగా విఫలమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతోపాటు వీరి చర్యల కారణంగా మరణించిన యాత్రికుల కుటుంబాల ప్రయోజనం కోసం కంపెనీలకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. ఈజిప్షియన్లు హజ్ తీర్థయాత్రలో మరణించారని, మరికొందరు తప్పిపోయినట్లు నివేదించబడిన వైద్య మరియు భద్రతా వనరుల నుండి వచ్చిన నివేదికలను అనుసరించి దర్యాప్తు చేయడానికి ఈజిప్ట్ ఒక సెల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. మరోవైపు సౌదీ అధికారుల సమన్వయంతో తప్పిపోయిన ఈజిప్టు పౌరుల ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని ఈజిప్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









