16 ట్రావెల్ కంపెనీల లైసెన్స్లను రద్దు చేసిన ఈజిప్ట్
- June 23, 2024
కైరో: యాత్రికుల అనధికార ప్రయాణానికి ఏర్పాట్లు చేశారన్న ఆరోపణలపై 16 ట్రావెల్ కంపెనీలకు లైసెన్స్లను రద్దు చేయాలని, వారి అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్కు పంపాలని ఈజిప్ట్ ప్రధాని ముస్తఫా మడ్బౌలీ ఆదేశించారు. ఈజిప్టు క్యాబినెట్ ప్రకటన ప్రకారం.. ఈ కంపెనీలు సరైన అనుమతి లేకుండా యాత్రికులను హజ్కు పంపడానికి మోసపూరిత పద్ధతులలో పాల్గొన్నాయని, యాత్రికులకు ఎటువంటి సేవలను అందించడంలో అవి పూర్తిగా విఫలమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతోపాటు వీరి చర్యల కారణంగా మరణించిన యాత్రికుల కుటుంబాల ప్రయోజనం కోసం కంపెనీలకు జరిమానా విధించబడుతుందని తెలిపారు. ఈజిప్షియన్లు హజ్ తీర్థయాత్రలో మరణించారని, మరికొందరు తప్పిపోయినట్లు నివేదించబడిన వైద్య మరియు భద్రతా వనరుల నుండి వచ్చిన నివేదికలను అనుసరించి దర్యాప్తు చేయడానికి ఈజిప్ట్ ఒక సెల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. మరోవైపు సౌదీ అధికారుల సమన్వయంతో తప్పిపోయిన ఈజిప్టు పౌరుల ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని ఈజిప్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







