డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో భేటీ కానున్న సినీ పెద్దలు
- June 23, 2024
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో సోమవారం మధ్యాహ్నం టాలీవుడ్ నిర్మాతలు సమావేశం కానున్నారు. విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో ఈ భేటీ జరుగుతుంది.
టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు సహకరించాలని ఉప ముఖ్యమంత్రిని నిర్మాతలు కోరనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వారు ఉప ముఖ్యమంత్రిని కలుస్తుండడం ఇదే తొలిసారి. సినిమా టిక్కెట్ల ధరలతో పాటు థియేటర్ల సమస్యలు వంటివి పవన్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
పవన్ ను అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబుతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య కలవనున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







