శంషాబాద్ విమానాశ్రయంలో రూ.59 లక్షల బంగారం పట్టివేత

- June 25, 2024 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.59 లక్షల బంగారం పట్టివేత

హైదరాబాద్: హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు తన మలద్వారంలో పసిడిని దాచుకున్నాడు.సదరు ప్రయాణికుడు అబుధాబి నుంచి వచ్చాడు. విమానాశ్రయంలో దిగిన అతని పై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతనిని ప్రశ్నించారు.ప్రయాణికుడి నుంచి దాదాపు రూ.59 లక్షల విలువ చేసే 806 గ్రాముల బంగారాన్ని గుర్తించారు.దీనిని అతను అక్రమంగా తీసుకువస్తున్నట్లు గుర్తించారు.కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు.

--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి, హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com