యూరోపియన్ మహిళ హత్య కేసు.. కిల్లర్కు జీవిత ఖైదు
- June 25, 2024
మనామా: యూరోపియన్ మహిళను చంపి, ఆమె శరీరాన్ని కాల్చి బూడిద చేసిన బహ్రెయిన్ వ్యక్తికి న్యాయమూర్తి బాదర్ అబ్దుల్తీఫ్ మహ్మద్ అల్ అబ్దుల్లా అధ్యక్షత వహించిన హై క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంతకుముందు అతనికి ఉరిశిక్ష విధించాలని హై క్రిమినల్ కోర్టులోని న్యాయమూర్తులను కోరింది. కేసు వివరాల ప్రకారం.. బాధితురాలు వ్యభిచార వ్యాపారంలో ఉన్నారు. ఆమెతో లైంగిక కార్యకలాపాల కోసం తన ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం ఆమె తన ఇంటి నుండి బయటకు వెళ్లడాన్ని ఇరుగుపొరుగు వారు చూస్తారనే ఆందోళనతో అతను ఆమెను వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఆమె వెళ్లిపోవాలని పట్టుబట్టడంతో.. ఈ క్రమంల ఆమె గొంతు కోసి చంపాడు. ఆమె మృతదేహాన్ని ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చివేశాడు. అయితే, ఆ మహిళ అంతకుమందే 999కి డిస్ట్రెస్ కాల్ చేసింది. సహాయం కోరింది. తాను సీ్త్ర సమీపంలోని ఇంట్లో ఉన్నానని తెలిపింది. ఆమెను చంపాలనే ఉద్దేశం తనకు లేదని, మద్యం, డ్రగ్స్ మత్తులో చేసినట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కిల్లర్కు జీవిత ఖైదు విధించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









