dh30 బిలియన్లతో దుబాయ్లో రెయిన్ డ్రైనేజీ నెట్వర్క్
- June 25, 2024
దుబాయ్: దుబాయ్లో రెయిన్ డ్రైనేజీ నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి 30 బిలియన్ దిర్హామ్ల వ్యయంతో ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఆమోదించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. 'తస్రీఫ్' అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్ట్ దుబాయ్ లో వర్షపు నీటి పారుదల వ్యవస్థ సామర్థ్యాన్ని 700% పెంచుతుంది. 2033 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది రాబోయే వందేళ్లపాటు దుబాయ్కు సేవలందిస్తుందని షేక్ మహ్మద్ తెలిపారు. 'తస్రీఫ్' ఎక్స్పో దుబాయ్ ప్రాంతం, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిటీ మరియు జెబెల్ అలీని కవర్ చేస్తూ 2019లో దుబాయ్ ప్రారంభించిన డ్రైనేజీ ప్రాజెక్టుల కొనసాగింపుగా పనిచేయనుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







