మంగాఫ్ ఫైర్ : 49వ బాధితుడు బీహార్ వాసిగా గుర్తింపు
- June 25, 2024
కువైట్: ఎన్బిటిసి క్యాంప్ ఫైర్లో 49వ బాధితుడు డిఎన్ఎ పరీక్ష నిర్వహించిన తర్వాత బీహార్లోని దర్బంగాకు చెందిన కలుకా (32)గా అధికారికంగా గుర్తించారు. కువైట్ అధికారుల సూచన మేరకు డీఎన్ఏ పరీక్ష ప్రక్రియల కోసం కలుకా సోదరుడు షారుక్ ఖాన్ ని NBTC యాజమాన్యం కువైట్కు రప్పించింది. గత ఏడేళ్లుగా NBTCలో ఉద్యోగి అయిన కలుకా ప్రస్తుతం NBTC హైవే సెంటర్లో సేల్స్మెన్గా పనిచేసేవారు. ఆయన పార్థివ దేహాన్ని సోమవారం రాత్రి 8.15 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై మీదుగా పాట్నాకు పంపినట్లు NBTC HR & అడ్మిన్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ మనోజ్ నంథియాలత్ తెలిపారు.
మంగాఫ్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా రూ.8 లక్షలు అందజేసారు. అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.25వేలు కువైట్లోని భారత రాయబార కార్యాలయంతో పంచుకున్నట్లు NBTC యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 6 మంది ఉద్యోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









