dh30 బిలియన్లతో దుబాయ్‌లో రెయిన్ డ్రైనేజీ నెట్‌వర్క్‌

- June 25, 2024 , by Maagulf
dh30 బిలియన్లతో దుబాయ్‌లో రెయిన్ డ్రైనేజీ నెట్‌వర్క్‌

దుబాయ్: దుబాయ్‌లో రెయిన్ డ్రైనేజీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి 30 బిలియన్ దిర్హామ్‌ల వ్యయంతో ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఆమోదించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు.  'తస్రీఫ్' అని పేరు పెట్టిన  ఈ ప్రాజెక్ట్ దుబాయ్ లో వర్షపు నీటి పారుదల వ్యవస్థ సామర్థ్యాన్ని 700% పెంచుతుంది. 2033 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది రాబోయే వందేళ్లపాటు దుబాయ్‌కు సేవలందిస్తుందని షేక్ మహ్మద్ తెలిపారు.  'తస్రీఫ్' ఎక్స్‌పో దుబాయ్ ప్రాంతం, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సిటీ మరియు జెబెల్ అలీని కవర్ చేస్తూ 2019లో దుబాయ్ ప్రారంభించిన డ్రైనేజీ ప్రాజెక్టుల కొనసాగింపుగా పనిచేయనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com