లోక్సభలో పవన్ పై ప్రశంసలు కురిపించిన ఎంపీ బాలశౌరి
- June 26, 2024
న్యూ ఢిల్లీ: లోక్సభలో మొదటిసారిగా జనసేన పార్టీ ఎంపీలు అడుగుపెట్టారు.ఆ పార్టీ తరపున లోక్సభకు ఇద్దరు పోటీచేసి గెలిచారు. పొత్తులో భాగంగా ఎన్డీయే కూటమిలో జనసేన భాగస్వామ్యంగా ఉంది. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీచేశాయి. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఏపీలో ఉండగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన రెండు స్థానాల్లో పోటీచేసింది. కాకినాడ, మచిలీపట్నం నుంచి ఆ పార్టీ ఎంపీలు గెలిచారు. 18వ లోక్సభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కాగా.. తొలిరోజే ఏపీకి చెందిన ఎంపీలు ప్రమాణం చేశారు. జనసేనకు చెందిన ఇద్దరు ఎంపీలు సోమవారం ప్రమాణం చేశారు.
బుధవారం లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగింది. ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లాకు జనసేన మద్దతు ప్రకటించింది. ఓంబిర్లా స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆయనను అభినందిస్తూ అన్ని పార్టీల ఎంపీలు మాట్లాడారు. దీనిలో భాగంగా జనసేన నుంచి ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడారు. జనసేన తరపున ఆయన లోక్సభలో తొలి ప్రసంగం చేశారు. 2019లో బాలశౌరి వైసీపీ ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరి ఆ పార్టీ తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీచేసి గెలిచారు.
స్పీకర్గా ఎన్నికైనందుకు ఓంబిర్లాకు పవన్ కళ్యాణ్ తరపున, జనసేన పార్టీ తరపున బాలశౌరి శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీతో పాటు 140 కోట్ల ప్రజలు ఓంబిర్లా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించగలరనే పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. తాను జనసేన ఎంపీగా గెలవడం ద్వారా ఇక్కడ మాట్లాడగలుగుతున్నానని.. తనకు ఈ అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్కు బాలశౌరి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో లోక్సభ వేదికగా పవన్పై ప్రశంసలు కురిపించారు.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ అన్నారు.ఎన్డీయే పక్షాల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పవన్ అంటే తుపాన్ అని వర్ణించిన విషయాన్ని బాలశౌరి గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓ చరిత్ర సృష్టించారని తెలిపారు. స్వాతంత్య్ర భారతదేశంలో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన అన్నారు. పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మాత్రమే సాధ్యమైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 21 అసెంబ్లీ, 2 లోక్సభ సీట్లలో పోటీచేసి.. అన్ని స్థానాల్లో విజయం సాధించామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







