లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో తీహార్ జైలుకు కేజ్రీవాల్..
- June 29, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరింత దర్యాప్తు కోసం కేజ్రీవాల్ను కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు విన్నవించింది. అందుకు అంగీకరించిన కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను కోర్టులో హాజరపర్చాలన్నా ఆదేశాలను ఈరోజు తెల్లవారుజామున ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ రిజర్వ్ చేశారు.
రిమాండ్ దరఖాస్తులో కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని, తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను సీబీఐ కోర్టుకు సమర్పించింది. జూలై 12వ తేదీ వరకు కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే సీఎం కేజ్రీవాల్ను తీహార్ జైలుకు తరలించనున్నారు. వచ్చే నెల 12న మధ్యాహ్న02 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ను కోర్టులో హాజరపర్చనున్నారు.
టోకు వ్యాపారులకు లాభాల మార్జిన్ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడంపై ఆప్ అధినేత సరైన వివరణ ఇవ్వలేదని సీబీఐ పేర్కొంది. దేశంలో కోవిడ్ రెండో వేవ్ కొనసాగుతున్న సమయంలో సౌత్ గ్రూప్కు చెందిన నిందితులు ఢిల్లీల మకాం వేసిన సమయంలో ఎక్సైజ్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం ఒక రోజులో హడావుడిగా సర్క్యులేషన్ ద్వారా అమలు చేయడంపై వివరణ ఇవ్వలేకపోయారని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇందులో కేజ్రీవాల్ సన్నిహితుడు విజయ్ నాయర్తో కూడా సమావేశమైనట్టు ఆరోపించింది.
ఢిల్లీలో మద్యం వ్యాపారంలో వాటాదారులతో తన సహచరుడు విజయ్ నాయర్తో సమావేశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలను కేజ్రీవాల్ దాటవేసినట్టు సెంట్రల్ ఏజెన్సీ ఆరోపించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు అర్జున్ పాండే, మూత గౌతమ్లను కలవడంపై కేజ్రీవాల్ సరైన వివరణ ఇవ్వలేకపోయారు.
ప్రముఖ రాజకీయ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంతో ప్రభావవంతమైన వ్యక్తి కావడంతో ఆయన్ను కస్టడీ విచారణలోనే ఉంచాలని సీబీఐ అభిప్రాయపడింది. లేదంటే.. ఇప్పటికే బహిర్గతమైన సాక్షులు, సాక్ష్యాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ దరఖాస్తులో పేర్కొంది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







