జీవితంలో రిస్క్ తీసుకోవాలి: అదనపు డీజీపీ మహేష్ భగవత్
- June 29, 2024
హైదరాబాద్: జీవితంలో రిస్క్ తీసుకోవాలని అదనపు డీజీపీ మహేష్ భగవత్ యువతకు పిలుపునిచ్చారు.రిస్క్ తీసుకుని ప్రయత్నిస్తే విజేతలు అవుతారని, లేదంటే అనుభవజ్ఞులు అవుతారని సూచించారు.
రామకృష్ణ మఠంలో జరుగుతున్న 'శౌర్య' శిబిరాన్ని సందర్శించి ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యూపీఎస్సీ విద్యార్థులకు ఇంటర్వ్యూని ఎదురుకునే విషయంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 2024లో 1016 మంది విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వగా 216 మంది క్వాలిఫై అయ్యారని, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అనన్య ౩వ రాంక్ సాధించారని ఆయన తెలిపారు. ఇంటర్వ్యూ విషయంలో కోచింగ్ కోరుకునే పేద విద్యార్థులు 9440700105 వాట్సాప్ నెంబర్కు వివరాలు పంపాలని మహేష్ భగవత్ సూచించారు.
'శౌర్య' శిబిరంలోని విద్యార్థులకు ఆయన 'టైం మేనేజ్మెంట్', 'స్ట్రెస్ మేనేజ్మెంట్' పై సూచనలు చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద ప్రసంగిస్తూ సమాజానికి టెక్నాలజీతో పాటు శ్రేష్ఠులైన యువతీయువకుల అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వామి వివేకానంద బోధనలు అనుసరిస్తూ జీవితాలను ఉద్ధరించుకోవాలని స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







