బహ్రెయిన్ లో 26% పెరిగిన లేబర్ అథారిటీ తనిఖీలు
- June 30, 2024
మనామా: బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఇటీవలే దాని త్రైమాసిక కార్యాచరణ నివేదికను విడుదల చేసింది. 2023 (జనవరి 1 నుండి జూన్ 20, 2024 వరకు) ఇదే కాలంతో పోలిస్తే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఉమ్మడి తనిఖీ ప్రయత్నాలలో దాదాపు 26% పెరుగుదల నమోదైనట్టు సీఈఓ నిబ్రాస్ మొహమ్మద్ తాలిబ్ తెలిపారు. ఉమ్మడి ప్రచారాలు 306 నుండి 358కి పెరిగాయని,తనిఖీ సందర్శనలు సుమారు 20,000 నుండి 25,200కి పెరిగినట్టు వెల్లడించారు. కార్మికులకు సకాలంలో న్యాయమైన పరిహారం అందించడం లక్ష్యంగా ప్రైవేట్ రంగం సహకారంతో వేతన రక్షణ వ్యవస్థలో తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. పని నాణ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతోపాటు వ్యాపార యజమానుల కోసం విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు సేవలను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను తీసుకురానున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







