బహ్రెయిన్ లో 26% పెరిగిన లేబర్ అథారిటీ తనిఖీలు
- June 30, 2024
మనామా: బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఇటీవలే దాని త్రైమాసిక కార్యాచరణ నివేదికను విడుదల చేసింది. 2023 (జనవరి 1 నుండి జూన్ 20, 2024 వరకు) ఇదే కాలంతో పోలిస్తే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఉమ్మడి తనిఖీ ప్రయత్నాలలో దాదాపు 26% పెరుగుదల నమోదైనట్టు సీఈఓ నిబ్రాస్ మొహమ్మద్ తాలిబ్ తెలిపారు. ఉమ్మడి ప్రచారాలు 306 నుండి 358కి పెరిగాయని,తనిఖీ సందర్శనలు సుమారు 20,000 నుండి 25,200కి పెరిగినట్టు వెల్లడించారు. కార్మికులకు సకాలంలో న్యాయమైన పరిహారం అందించడం లక్ష్యంగా ప్రైవేట్ రంగం సహకారంతో వేతన రక్షణ వ్యవస్థలో తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. పని నాణ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతోపాటు వ్యాపార యజమానుల కోసం విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు సేవలను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను తీసుకురానున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు









