బహ్రెయిన్ లో 26% పెరిగిన లేబర్ అథారిటీ తనిఖీలు
- June 30, 2024
మనామా: బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఇటీవలే దాని త్రైమాసిక కార్యాచరణ నివేదికను విడుదల చేసింది. 2023 (జనవరి 1 నుండి జూన్ 20, 2024 వరకు) ఇదే కాలంతో పోలిస్తే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఉమ్మడి తనిఖీ ప్రయత్నాలలో దాదాపు 26% పెరుగుదల నమోదైనట్టు సీఈఓ నిబ్రాస్ మొహమ్మద్ తాలిబ్ తెలిపారు. ఉమ్మడి ప్రచారాలు 306 నుండి 358కి పెరిగాయని,తనిఖీ సందర్శనలు సుమారు 20,000 నుండి 25,200కి పెరిగినట్టు వెల్లడించారు. కార్మికులకు సకాలంలో న్యాయమైన పరిహారం అందించడం లక్ష్యంగా ప్రైవేట్ రంగం సహకారంతో వేతన రక్షణ వ్యవస్థలో తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. పని నాణ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతోపాటు వ్యాపార యజమానుల కోసం విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు సేవలను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను తీసుకురానున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం: సీఎం చంద్రబాబు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక
- ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!
- కువైట్లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
- నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- తెలంగాణలో అపోలో ఫార్మసీ వెయ్యి స్టోర్ల మైలురాయి
- ఈ ప్రభుత్వం మీది..అండగా ఉంటాం: సీఎం రేవంత్
- ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- వేట్లపాలెంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్









