ఏడాది పొడవునా ఫ్రీ మెడికల్ చికిత్సలు
- June 30, 2024
దుబాయ్: వాలంటీర్ గా వైద్యులు ప్రతి శుక్రవారం 300 మందికి పైగా రోగులకు ఉచిత చికిత్స అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రతివారం వచ్చే వారికి ఉచిత వైద్య పరీక్షలు మరియు చికిత్సలను అందజేస్తున్నారు. గత రమదాన్ సందర్భంగా దుబాయ్లో తడవి హెల్త్ గ్రూప్ ప్రారంభించిన ఈ హ్యుమానిటీ కార్యక్రమం.. దుబాయ్లోని దేరా లోని తడవి హెల్త్ సెంటర్లో ఏడాది పొడవునా ప్రతి శుక్రవారం కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు 1,000 మందికి పైగా పేద రోగులకు చికిత్స అందించారు. ఈ చొరవలో భాగంగా పేదవారికి వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుందని భారతదేశానికి చెందిన డాక్టర్. షిబ్నీ బషీర్ తెలిపారు. క్లినిక్ మేనేజర్ రమేష్చంద్ బాలగోవిందన్ మాట్లాడుతూ..ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించడానికి మరియు ఆర్థిక స్థోమత లేని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అందించడానికి తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి శుక్రవారం 300 మందికి పైగా రోగులు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







