శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పు.. టీటీడీ క్లారిటీ
- July 03, 2024
తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది.
ఇదంతా తప్పుడు ప్రచారం అని టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదంలో సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోందని.. అది పూర్తిగా అసత్యమని అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల అర్చకులు, ఆలయ అధికారులతో ఈవో శ్యామలరావు నిర్వహించిన సమావేశంలో స్వామి వారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని అధికారులు వెల్లడించారు . అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. కానీ.. అన్న ప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- జిన్సెంగ్ కాఫీ, చాక్లెట్ ఉత్పత్తులపై సౌదీ హెచ్చరిక..!!
- యూఏఈ ఆగస్టు లాంగ్ వీకెండ్కు సలాలా ఫస్ట్ ఛాయిస్..!!
- ట్రైనీ ఐపీఎస్కు సీపీ సజ్జనార్ షాక్: 5 గంటల పాటు సుదీర్ఘ విచారణ!
- యూఏఈలో ప్రవక్త మహ్మద్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 28న ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సెలవు
- వైజాగ్ వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్
- వందే మాతరం ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష
- యూఏఈలో ఆన్లైన్లోనే మ్యారేజ్ కాంట్రాక్ట్ నమోదు.. స్టెప్ బై స్టెప్ గైడ్..!!
- మెటాకు 567 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన న్యూమెక్సికో కోర్టు
- హౌతీ దాడుల్లో నజ్రాన్లో 11 మంది పౌరులకు గాయాలు..!!
- ధోఫార్లో ‘లైఫ్ ఆఫ్టర్ లైఫ్’ అవగాహన ప్రచారం ప్రారంభం..!!







