శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పు.. టీటీడీ క్లారిటీ
- July 03, 2024
తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది.
ఇదంతా తప్పుడు ప్రచారం అని టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదంలో సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోందని.. అది పూర్తిగా అసత్యమని అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల అర్చకులు, ఆలయ అధికారులతో ఈవో శ్యామలరావు నిర్వహించిన సమావేశంలో స్వామి వారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని అధికారులు వెల్లడించారు . అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. కానీ.. అన్న ప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







