శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పు.. టీటీడీ క్లారిటీ
- July 03, 2024
తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది.
ఇదంతా తప్పుడు ప్రచారం అని టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదంలో సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోందని.. అది పూర్తిగా అసత్యమని అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల అర్చకులు, ఆలయ అధికారులతో ఈవో శ్యామలరావు నిర్వహించిన సమావేశంలో స్వామి వారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని అధికారులు వెల్లడించారు . అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. కానీ.. అన్న ప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









