ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
- July 04, 2024
న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. వివిధ అంశాలపై మాట్లాడారు.
ఇక మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురీతో భేటీ కానున్నారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ నీరబ్ కుమార్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









