రూ.5వేలతో పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్
- July 04, 2024
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ శంషాబాద్ విమానాశ్రయానికి నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.5 వేలు. ఈ పాస్తో ఏ బస్సులోనైనా, సిటీలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పుష్పక్ పాస్తోపాటు శంషాబాద్, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్రోడ్స్, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి రూట్పాస్, గ్రీన్ మెట్రో గ్రేటర్జోన్లోని ప్రయాణికుల కోసం మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో రూ.1900తో నెలవారీ పాస్ను తీసుకొచ్చింది.
ఇది సికింద్రాబాద్-పటాన్చెరు (219), బాచుపల్లి-వేవ్రాక్ వయా జేఎన్టీయూ (195), కోఠి-కొండాపూర్ (127కే) మార్గాల్లో చెల్లుబాటు అవుతుంది. రూట్పాస్ ధరలను రూ. 2 వేల నుంచి రూ. 4 వేలుగా నిర్ణయించింది. శంషాబాద్ నుంచి రూ. 2 వేలు, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్రోడ్ నుంచి రూ. 3 వేలు, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి రూ. 4 వేలుగా పాస్ ధరలను నిర్ణయించింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







