టీం ఇండియాతో మార్మోగిన వాంఖడే స్టేడియం..
- July 04, 2024
ముంబై: టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీతో భారత్ కి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్మానించేందుకు బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీమిండియా ఆటగాళ్లు వాంఖడే మైదానానికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. ఆటగాళ్లు జాతీయ జెండాలు చేతబూని స్టేడియమంతా కలియతిరిగారు. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేసి అభిమానుల్లో జోష్ నింపారు.
అనంతరం వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రపంచకప్ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ట్రోఫీ గెలుపులో కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, పేసర్ బుమ్రా అభినందనలు తెలిపారు.ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా రూ.125 కోట్ల ప్రైజ్ మనీ చెక్కును టీమిండియా క్రికెటర్లకు అందించారు.వాంఖడే స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించారు.దీంతో స్టేడియంలోని స్టాండ్స్ అన్నీ ఫ్యాన్స్తో కిక్కిరిసిపోయాయి.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







