నేను ఒక్కడినే రష్యాకు రాలేదు : ప్రధాని మోడీ
- July 09, 2024
మాస్కో: భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యాకు తాను ఒక్కడినే రాలేదని… 140 కోట్ల మంది భారతీయుల ప్రేమను మోసుకొచ్చానని, భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చానని భావోద్వేగభరితంగా చెప్పారు.
ఇటీవలే తాను మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని, ఇక నుంచి మూడు రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. భారత్ ను ఇప్పటికే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని, దేశాన్ని ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ ముందున్న లక్ష్యమని మోడీ ఉద్ఘాటించారు.
భారత్ ఇప్పుడు ప్రపంచంలో ప్రముఖ స్థానం పొందిందని, మనం సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని వ్యాఖ్యానించారు. మరే దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేశామని, డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉందని వివరించారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









