కువైట్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ప్రవాసులు మృతి..మృతుల్లో భారతీయులు

- July 10, 2024 , by Maagulf
కువైట్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ప్రవాసులు మృతి..మృతుల్లో భారతీయులు

కువైట్: మంగళవారం తెల్లవారుజామున ఏడవ రింగ్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశీయులు సహా ఏడుగురు ప్రవాసులు మరణించారు. అధికారుల కథనం ప్రకారం.. వారు తమ పని స్థలం నుండి మినీ వ్యాన్‌లో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను మరొక వాహనం ఢీకొనడంతో వ్యాన్ నియంత్రణ కోల్పోయి అబ్దుల్లా అల్ ముబారక్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఏడవ రింగ్ రోడ్డులో వంతెన డివైడర్‌ను ఢీకొట్టింది. దుర్ఘటనలో మరణించిన భారతీయులను బిహారీ లాల్, బక్కర్ సింగ్, బిక్రమ్ సింగ్, దేవేందర్ సింగ్ మరియు రాజ్ కుమార్ కృష్ణస్వామిగా గుర్తించారు. సురేంద్రన్, బిను మనోహరన్, గురుచరణ్ సింగ్ సహా ముగ్గురు భారతీయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com