ఔట్ డోర్ కార్మికులకు ఊరట
- June 14, 2016
ఖతార్ వ్యాప్తంగా ఔట్ డోర్లో పనిచేసే కార్మికుల కోసం పని వేళల్లో మార్పులు చేయనున్నారు. జూన్ 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. సుమారు 75 రోజులపాటు ఔట్ డోర్లో పనిచేసే కార్మికులకు ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పని చేయకుండా వెసులుబాటు కల్పిస్తారు. ఈ మేరకు మినిస్టీరియల్ ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా ఉన్నాయి. నిబంధనల్ని ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇదిలా ఉండగా, మినిస్ట్రీ ఇన్స్ట్రక్షన్స్ రాకుండానే కొన్ని సంస్థలు ఇప్పటికే ఈ టైమింగ్స్ని అమల్లోకి తెచ్చాయి. పగటి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటిన ప్రస్తుత పరిస్థితుల్లో డైరెక్ట్ సన్ లైట్లో పని చేయడం కార్మికులకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఉదయం 11 గంటలకే ఉద్యోగులకు విరామం ప్రకటిస్తున్నాయి కొన్ని సంస్థలు. మధ్యాహ్న వేళల్లో పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని, ఔట్ డోర్ పనిని వాతావరణం చల్లబడిన తర్వాత, రాత్రి వేళల్లో ఎక్కువగా చేపడుతున్నాయ పలు సంస్థలు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







