ఏపీలో రూ.60 వేల కోట్ల బీపీసీయల్ పెట్టుబడి: ఎంపీ బాలశౌరి
- July 10, 2024
విజయవాడ: తెలంగాణా, ఏపీ విభజన తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలో ఒక రిఫైనరీ ఇవ్వాలని ఉందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. ఇటీవల ఢిల్లీ వచ్చిన చంద్రబాబు.. ఈ అంశాన్ని కేంద్ర పెద్దలను కలిసి విన్నవించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఆయిల్ రిఫైనరీ ఏపీకి ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
బీపీసీయల్ సీఎండీ, ఇతర బోర్డు సభ్యులు ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని తెలిపారు. ముందుగా అందరం దుర్గమ్మను దర్శించుకున్నామన్నారు. భగవంతుడి దయ వల్ల 60వేల కోట్ల ప్రాజెక్టు ఏపీకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎం సూచనలతో ఎంపీలంతా ఈ ప్రాజెక్టు త్వరతిగతిన తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.
ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన కనక దుర్గమ్మను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, బీపీసీఎల్ సీఎండీ కృష్ణ కుమార్ , పీబీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ గుప్తా బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదమంత్రోచరణలు, మంగళవాయిధ్యాలతో ఆలయ ఈవో స్వాగతం పలికారు. అధికారులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..