‘మిస్టర్ బచ్చన్’ వెర్సస్ ‘ఇస్మార్ట్ శంకర్’.! పోటీ గట్టిగానే.!
- July 11, 2024
ఆగస్టు 15 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రూలింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. అనుకోని కారణాలతో ఆ సినిమా రిలీజ్ పోస్ట్పోన్ కావడంతో రామ్ పోతినేని - పూరీ జగన్నాధ్ కాంబో మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ లైన్లోకి వచ్చింది.
అదే డేట్కి సోలో రిలీజ్ అని ప్రకటించుకుంది. అయితే, లేటెస్ట్గా ఇదే డేట్లోకి మాస్ రాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో వచ్చి చేరాడు. దాంతో, ‘ఇస్మార్ట్ శంకర్’కి గట్టి పోటీ కుదిరింది.
రెండూ మాస్ ఓరియెంటెడ్ సినిమాలే. రెండు సినిమాల డైరెక్టర్లూ గట్స్ వున్నవాళ్లే. ఈ పోటీ బాక్సాఫీస్కీ ఆరోగ్యకరమే. ఇలాంటి పెద్ద సినిమాలు పోటీగా రిలీజ్ అయితేనే బాక్సాఫీస్ కళకళలాడుతుంది.
అయితే, ఈ సినిమాల రిజల్ట్ ఇద్దరు హీరోలకీ అగ్ని పరీక్షే. ప్రస్తుతం రామ్ పోతినేనికి ఓ బడా హిట్ కావాలి. అలాగే, మాస్ రాజా రవితేజకీ. ‘ఇస్మార్ట్ శంకర్’ అంచనాలతో ఈ సినిమాపైనా అంచనాలు బాగున్నాయ్.
అలాగే, బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’కి రీమేక్గా, రీమేకుల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కావడంతో, ‘మిస్టర్ వచ్చన్’ పైనా అంచనాలు బాగానే వున్నాయ్. చూడాలిక బాక్సాఫీస్ వద్ద ఏ హీరో దమ్మెంతో.!
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







