‘పొలిమేర 3’ కి రంగం సిద్ధం.!
- July 11, 2024
సత్యం రాజేష్ హీరోగా వచ్చిన ‘పొలిమేర’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మూఢ నమ్మకాల బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్కి ధియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
అదే ఉత్సాహంతో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా రూపొందించారు. అదే ‘పొలిమేర 2’. అయితే, ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. రెండో పార్ట్కీ రెస్పాన్స్ అదిరిపోయింది. సత్యం రాజేష్తో పాటూ, బాలాదిత్య, గెటప్ శీను తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
హీరోయిన్గా నటించిన కామాక్షి భాస్కర్లకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయ్ ఈ రెండు సినిమాలు. అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలకి భోగేంద్ర గుప్త నిర్మాతగా వ్యవహరించారు.
కాగా ఈ సినిమాకి లేటెస్ట్గా మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్లు. మూడో పార్ట్ని మరింత థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించబోతున్నట్లుగా ప్రకటించారు.
రెండో పార్ట్ చివరిలో భర్త అయిన సత్యం రాజేష్ని విషం పెట్టి చంపేసి, తాను కూడా చనిపోతుంది కామాక్షి భాస్కర్ల. అక్కడితో సినిమా అయిపోలేదు. మూడో పార్ట్లో కూడా ఈ రెండు పాత్రలూ కంటిన్యూ కానున్నాయ్. అంటే ఈ పాత్రల్ని ఎలా ఎక్కడ కనెక్ట్ చేస్తారో.. అనే క్యూరియాసిటీ ఆడియన్స్లో నెలకొంది. అలాగే పాత క్యారెక్టర్లతో పాటూ, కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా ఈ మూడో పార్ట్లో యాడ్ కానున్నాయట.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









