‘పొలిమేర 3’ కి రంగం సిద్ధం.!
- July 11, 2024
సత్యం రాజేష్ హీరోగా వచ్చిన ‘పొలిమేర’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మూఢ నమ్మకాల బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్కి ధియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
అదే ఉత్సాహంతో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా రూపొందించారు. అదే ‘పొలిమేర 2’. అయితే, ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. రెండో పార్ట్కీ రెస్పాన్స్ అదిరిపోయింది. సత్యం రాజేష్తో పాటూ, బాలాదిత్య, గెటప్ శీను తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
హీరోయిన్గా నటించిన కామాక్షి భాస్కర్లకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయ్ ఈ రెండు సినిమాలు. అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలకి భోగేంద్ర గుప్త నిర్మాతగా వ్యవహరించారు.
కాగా ఈ సినిమాకి లేటెస్ట్గా మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్లు. మూడో పార్ట్ని మరింత థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించబోతున్నట్లుగా ప్రకటించారు.
రెండో పార్ట్ చివరిలో భర్త అయిన సత్యం రాజేష్ని విషం పెట్టి చంపేసి, తాను కూడా చనిపోతుంది కామాక్షి భాస్కర్ల. అక్కడితో సినిమా అయిపోలేదు. మూడో పార్ట్లో కూడా ఈ రెండు పాత్రలూ కంటిన్యూ కానున్నాయ్. అంటే ఈ పాత్రల్ని ఎలా ఎక్కడ కనెక్ట్ చేస్తారో.. అనే క్యూరియాసిటీ ఆడియన్స్లో నెలకొంది. అలాగే పాత క్యారెక్టర్లతో పాటూ, కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా ఈ మూడో పార్ట్లో యాడ్ కానున్నాయట.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









