‘పొలిమేర 3’ కి రంగం సిద్ధం.!
- July 11, 2024
సత్యం రాజేష్ హీరోగా వచ్చిన ‘పొలిమేర’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మూఢ నమ్మకాల బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్కి ధియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
అదే ఉత్సాహంతో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా రూపొందించారు. అదే ‘పొలిమేర 2’. అయితే, ఈ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు. రెండో పార్ట్కీ రెస్పాన్స్ అదిరిపోయింది. సత్యం రాజేష్తో పాటూ, బాలాదిత్య, గెటప్ శీను తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
హీరోయిన్గా నటించిన కామాక్షి భాస్కర్లకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయ్ ఈ రెండు సినిమాలు. అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలకి భోగేంద్ర గుప్త నిర్మాతగా వ్యవహరించారు.
కాగా ఈ సినిమాకి లేటెస్ట్గా మూడో పార్ట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్లు. మూడో పార్ట్ని మరింత థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించబోతున్నట్లుగా ప్రకటించారు.
రెండో పార్ట్ చివరిలో భర్త అయిన సత్యం రాజేష్ని విషం పెట్టి చంపేసి, తాను కూడా చనిపోతుంది కామాక్షి భాస్కర్ల. అక్కడితో సినిమా అయిపోలేదు. మూడో పార్ట్లో కూడా ఈ రెండు పాత్రలూ కంటిన్యూ కానున్నాయ్. అంటే ఈ పాత్రల్ని ఎలా ఎక్కడ కనెక్ట్ చేస్తారో.. అనే క్యూరియాసిటీ ఆడియన్స్లో నెలకొంది. అలాగే పాత క్యారెక్టర్లతో పాటూ, కొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా ఈ మూడో పార్ట్లో యాడ్ కానున్నాయట.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







