సౌదీ ఎయిర్లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
- July 12, 2024
సౌదీ ఎయిర్లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రియాద్ నుంచి బయలుదేరిన విమానం పెషావర్ ఎయిర్పోర్ట్లో దిగుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు రావడాన్ని విమానాశ్రయం ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు గుర్తించారు.ఈ విషయాన్ని విమాన పైలెట్తోపాటు సహాయక బృందాలకు సమాచారం అందించారు.దీంతో విమానాన్ని వెంటనే విమానాశ్రయంలో నిలిపివేశారు.
అనంతరం విమానం నుంచి ప్రయాణికులతోపాటు సిబ్బందిని దింపివేశారు.మరోవైపు విమానం గేర్ వద్ద ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు.ఈ ఘటనకు గల కారణాలను సాంకేతిక బృంద నిపుణులు అన్వేషిస్తున్నారు.ఈ రోజు ఉదయం 276 మంది ప్రయాణికులు, 21 విమాన సిబ్బందితో రియాద్ నుంచి సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఎస్వీ 792 పాకిస్థాన్లోని పెషావర్కు బయలుదేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సౌదీ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







