సౌదీ ఎయిర్లైన్స్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
- July 12, 2024
సౌదీ ఎయిర్లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రియాద్ నుంచి బయలుదేరిన విమానం పెషావర్ ఎయిర్పోర్ట్లో దిగుతున్న సమయంలో ఎడమ గేర్ నుంచి దట్టమైన పొగలతోపాటు మంటలు రావడాన్ని విమానాశ్రయం ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు గుర్తించారు.ఈ విషయాన్ని విమాన పైలెట్తోపాటు సహాయక బృందాలకు సమాచారం అందించారు.దీంతో విమానాన్ని వెంటనే విమానాశ్రయంలో నిలిపివేశారు.
అనంతరం విమానం నుంచి ప్రయాణికులతోపాటు సిబ్బందిని దింపివేశారు.మరోవైపు విమానం గేర్ వద్ద ఎగసిపడుతున్న మంటలను ఆర్పివేశారు.ఈ ఘటనకు గల కారణాలను సాంకేతిక బృంద నిపుణులు అన్వేషిస్తున్నారు.ఈ రోజు ఉదయం 276 మంది ప్రయాణికులు, 21 విమాన సిబ్బందితో రియాద్ నుంచి సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఎస్వీ 792 పాకిస్థాన్లోని పెషావర్కు బయలుదేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సౌదీ ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









