బాహుబలి సెట్ లో సందడి చేసిన ప్రియమణి
- June 14, 2016
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'బాహుబలి-2' సినిమా సెట్లో సోమవారం నటి ప్రియమణి సందడి చేశారు. కొంత సమయం సెట్లో గడిపి విమానాశ్రయానికి చేరుకున్నట్లు ప్రియమణి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. సెట్లోకి తనను అనుమతించి, చరిత్రాత్మక యుద్ధ సన్నివేశాన్ని చూడనిచ్చినందుకు యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు.
దీనికి చిత్ర బృందం తమ ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. మీరు మా సెట్కు రావడం సర్ప్రైజ్గా భావించాం. మీరు ఏమి చూశారో..
అది మీకు నచ్చిందనుకుంటున్నాం అని ట్వీట్ చేసింది. అంతేకాదు ప్రియమణి రాకపై ట్విట్టర్ వేదికగా ఆమెకు, యూనిట్ సభ్యులు రానా, సెంథిల్కుమార్, లీ విట్టేకర్కి మధ్య సంభాషణ జరిగింది. సెట్కు ఎప్పుడు వచ్చావని, ఎందుకు హాయ్ చెప్పలేదని వీరు ప్రియమణిని ప్రశ్నించారు. 'యమదొంగ' చిత్రం కోసం రాజమౌళి, ప్రియమణి కలిసి పని చేశారు. రాజమౌళి షూటింగ్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్త పడతారన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి







