లోన్స్ తీసుకున్న వారికి షాక్ ఇచ్చిన ఎస్బీఐ
- July 15, 2024
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు నేడు తెలిపింది. కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
సవరించిన రేట్లు నేటి (జులై 15) నుంచే అమలులోకి వస్తాయని ఎస్బీఐ తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఏడాది కాలవ్యవధి గల ఎంసీఎల్ఆర్ను 8.75 శాతం నుంచి 8.85 శాతానికి.. ఆరు నెలల కాలవ్యవధికి 8.65 శాతం నుంచి 8.75 శాతానికి.. రెండేళ్లకు 8.85 శాతం నుంచి 8.95 శాతానికి, మూడేళ్ల కాలపరిమితి 8.95 శాతం నుంచి 9 శాతానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత లోన్ల ఈఎంఐలు మరింత ప్రీమియం కానున్నాయి. ఎస్బీఐ ఆటో రుణాలు ఒక సంవత్సరం, వ్యక్తిగత రుణాలు 2 సంవత్సరాల ఎంసీఎల్ఆర్కు అనుసంధానం చేశారు.
కాగా, ఎంసీఎల్ఆర్ అనేది ప్రామాణిక రుణ రేటుగా నిర్ధరాంచింది. నిధుల సేకరణకు బ్యాంకులకు అయ్యే వ్యయం, నిర్వహణ వ్యయం, క్యాష్ రిజర్వు రేషియో, కాల పరిమితి, ప్రీమియంలను పరిగణలోకి తీసుకుని ఎంసీఎల్ఆర్ను సీఎస్బీఐ లెక్కిస్తుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువకు రుణం అందించే ఛాన్స్ ఉండదు.. వివిధ కాలపరిమితులకు (ఓవర్ నైట్ నుంచి మూడేళ్ల వరకు) ఎంసీఎల్ఆర్ వేర్వేరుగా ఉంటాయి. ఎస్బీఐ ప్రస్తుతం గృహ రుణాలను 'ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్స్' ఆధారంగా అందిస్తుంది. ఇందులో మాత్రం ఎలాంటి సవరణలు చేయలేదని పేర్కొనింది. ప్రస్తుతం ఈ ఈబీఎల్ఆర్ 9.15శాతం + సీఆర్పీ + బీఎస్పీ దగ్గర స్థిరంగా ఉంచింది. ప్రస్తుతం ఎస్బీఐ హోం లోన్ వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉంది. సిబిల్ స్కోర్ సహా ఇతర అర్హతలను బట్టి ఇది మారిపోతుంది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









