ఉక్రెయిన్-రష్యా యుద్ధం..భారత్కు మరోసారి అమెరికా విజ్జప్తి
- July 16, 2024
వాషింగ్టన్: ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడాలని భారత్కు అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేయాలని కోరింది.
భారత్-రష్యా బంధం సుదీర్ఘమైనదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ క్రమంలో మాస్కో కైవ్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా భారత్ జోక్యం చేసుకోవాలని కోరింది. ఇందుకు తన దీర్ఘకాల సంబంధాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.
ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఢిల్లీ-మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో యూఎన్ చార్టర్ను గౌరవించాలని పుతిన్కు చెప్పాలని కోరారు. పుతిన్ చట్టవిరుద్ధమైన యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్కు సూచించాలని మిల్లర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







