ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం..భారత్‌కు మరోసారి అమెరికా విజ్జప్తి

- July 16, 2024 , by Maagulf
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం..భారత్‌కు మరోసారి అమెరికా విజ్జప్తి

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలని భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేయాలని కోరింది.

భారత్-రష్యా బంధం సుదీర్ఘమైనదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ క్రమంలో మాస్కో కైవ్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా భారత్ జోక్యం చేసుకోవాలని కోరింది. ఇందుకు తన దీర్ఘకాల సంబంధాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.

ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఢిల్లీ-మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో యూఎన్ చార్టర్‌ను గౌరవించాలని పుతిన్‌కు చెప్పాలని కోరారు. పుతిన్ చట్టవిరుద్ధమైన యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్‌కు సూచించాలని మిల్లర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com