బైజూస్‌పై బీసీసీఐ పిటిషన్.. దివాలా ప్రక్రియకు అనుమతి

- July 16, 2024 , by Maagulf
బైజూస్‌పై బీసీసీఐ పిటిషన్.. దివాలా ప్రక్రియకు అనుమతి

బెంగళూరు: ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు మరో షాక్‌ తగిలింది. స్పాన్సర్‌షిప్‌ బకాయిల వ్యవహారంలో బీసీసీఐ దాఖలు చేసిన దివాలా ప్రక్రియకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) బెంగళూరు బెంచ్‌ అనుమతించింది.

భారత క్రికెట్‌ టీమ్‌కు స్పాన్సర్‌షిప్‌నకు సంబంధించి రూ.160 కోట్లు చెల్లించలేదన్నది బీసీసీఐ ఆరోపణ.

బైజూస్‌ ఓ దశలో వెలుగు వెలిగినప్పుడు బీసీసీఐ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 2023 నవంబర్‌ వరకు జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్‌ వ్యవహరించాల్సిఉండగా.. అర్ధంతరంగా అది వైదొలిగింది. ఈనేపథ్యంలో కాంట్రాక్ట్‌ ముగిసినా రూ.160 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంపై గతేడాది నవంబర్‌లో బైజూస్‌పై ఎన్‌సీఎల్‌టీ కేసు నమోదైంది. అప్పట్లో బీసీసీఐతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించుకుంటామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. ఒక్క బీసీసీఐ మాత్రమే కాదు.. ఫిఫా, ఐసీసీ వంటి బ్రాండ్లకూ బీసీసీఐ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 2023 నుంచి వాటి రెన్యువల్‌ను నిలిపివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com